GNTR: తాడేపల్లి మండలం పెనుమాక 7, 8 వార్డుల కొండ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇళ్లకు కుళాయిలున్నా ఏళ్లుగా చుక్క నీరు రావడం లేదు. కృష్ణా నది పక్కనే ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. నీరు ఇవ్వకున్నా పన్నులు కట్టాలని అధికారులు అడుగుతున్నారు. దీంతో మంచినీరు కొనుక్కుంటూ జనం అవస్థలు పడుతున్నారు. తమ నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.