కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఇవాళ ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేదవతి, ఆర్డీఎస్, సుంకేసుల, గాజులదిన్నె, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులపై వివరాలు అధికారులను అడిగారు. లిఫ్ట్ ఇరిగేషన్ పంపుల ఏర్పాటు, గేట్ల మరమ్మతులు, ఆధునికరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.