E.G: BR అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మంగళవారం బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ ప్రజలతో కలిసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపకర్త, విద్యా స్ఫూర్తి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ‘జై భీమ్- జై భీమ్’ అంటూ నినాదాలు చేశారు.