W.G: భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీపద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారు 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను శనివారం సంప్రదాయ బద్దంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వామివారిని దర్శించుకుని వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. 8 రోజులపాటు కల్యాణోత్సవం, గరుడోత్సవం, వైభవోత్సవం, రథోత్సవం, ఉంజల సేవలు జరుగుతాయి అన్నారు.