VSP: సింహాచలం దేవస్థానం ద్వారా నిర్వహించబడుతున్న నాదస్వర పాఠశాల విద్యార్థులకు మంగళవారం దేవస్థానం తరపున ప్రత్యేక వితరణ కార్యక్రమం నిర్వహించారు. నాదస్వరం, డోలు అభ్యసిస్తున్న విద్యార్థుల సాధన కోసం సుమారు రూ.లక్ష విలువగల డోలు వాయిద్యానికి అత్యంత కీలకమైన ఆకులు, మూతలు ఈఓ వెంకట్రావు అందజేశారు. ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈవో పేర్కొన్నారు.