NTR: ఎన్టీఆర్ కాలనీలో ఇటీవల జరిగిన డిజిటల్ అరెస్టుపై పోలీసులు ప్రజలకు బ్యాంకు సిబ్బందికి అవగాహన నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు, ఫోన్ కాల్ ద్వారా మోసాలు, OTPలు బ్యాంక్ వివరాలు అడిగి డబ్బులు దోచుకునే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల కాల్స్, మెసేజ్లను నమ్మవద్దని సూచించారు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదన్నారు.