TPT: స్థానిక గాంధీ రోడ్డులో కస్తూరిబా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్ట్ ఛైర్మన్ డా. P.C.రాయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో TDP రాష్ట్ర నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కస్తూరిబా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులర్పించి సుమారు 1000 మంది పేదలకు వస్త్రదానం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.