CTR: జిల్లాలో పాడి రైతులకు పశు పోషణ భారంగా మారింది. గతంలో పొలాల వద్ద పచ్చిగడ్డి విరివిగా లభించేది. ప్రస్తుతం వేసవి కావడంతో పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. లభ్యత లేకపోవడంతో వరిగడ్డిని ఇతర జిల్లాల నుంచి రవాణా చేసుకుంటున్నారు. వాటికి అధికంగా డిమాండ్ ఉండటంతో ప్రస్తుతం ట్రాక్టర్ వరి గడ్డి రూ. 20 వేలు పలుకుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.