AKP: పరవాడ మండలం లంకెలపాలెంలో పరదేశిమాంబ పండగ సందర్భంగా ఆర్కే రాయల్ యూత్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలను పెందుర్తి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ ప్రారంభించారు. వచ్చే నెల 6వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.