VZM: గజపతినగరం మండలం పురిటిపెంట న్యూ కాలనీలో గల దేవర కిరణ్ ఇంటి వద్ద ఆదివారం ‘మన ఊరు-మన జెండా’ నిర్వహించారు. ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల్ గోపి ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ పిలుపు మేరకు పార్టీ పతాకాన్ని ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవర కిరణ్ ఆవిష్కరించారు. జిల్లా ఓబీసీ అధ్యక్షులు దొగ్గ దేవుడు బాబు పాల్గొన్నారు.