ATP: అనంతపురం రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్ తన భార్య తేజస్వినిపై చాకుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న వీరి మధ్య మనస్పర్థాలు రావడంతో, ఆమె పనిచేసే బిర్యానీ సెంటర్ వద్దకు వెళ్లి రాజేష్ గొడవపడ్డాడు. సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.