కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 293 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆచ్ఐవో లాలప్ప తెలిపారు. మొత్తం 21,428 మందిలో 21,135 మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. పరీక్షలపై సందేహాలుంటే ఆర్ఎవో కార్యాలయ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు. నిబంధనల మేరకు పరీక్షలు సజావుగా నిర్వహించామన్నారు.