ELR: విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కఠిన చర్యలు చేపట్టారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జీవరత్నంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కొందరిని వీఆర్కు పంపిన ఎస్పీ, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.