NTR: విస్సన్నపేట(M) తాతకుంట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతు సేవ కేంద్రం సిబ్బందికి అవగాహన, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనలు లేని ఆరోగ్యకరమైన జీవన శైలికి ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండించడం ఎంతో ముఖ్యమని ఏవో రాజ్యలక్ష్మి అన్నారు. 0-20 సెంట్ల పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానమైన ATM విధానాన్ని పరిశీలించారు.