ATP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.