VZM: ఉపాధి హామీ పథకం పనుల్లో సమయపాలన పాటించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం రంగరాయపురంలోని రంగరాయ చెరువులో పనులను మంగళవారం పరిశీలించారు. కనీస వేతనాలు వచ్చేలా రెండు పూటలు పనులు చేపించాలని సిబ్బందికి సూచించారు. పనుల వద్ద నీరు, నీడ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, కొలతలు ప్రకారం పనులు చేయాలని ఆదేశించారు.