AKP: నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయని టౌన్ సీఐ గపూర్ తెలిపారు. ఇందులో భాగంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు, గస్తీలు నిర్వహిస్తారన్నారు. ప్రజలు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. అలాగే, నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.