విశాఖ: కాపులప్పాడ సర్వే నెంబర్ 314 ప్రభుత్వ భూమిలో రాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు ఫెన్సింగ్ పోల్స్ వేసి కబ్జాలకు పాల్పడుతున్నారని మంగమారిపేట స్థానికులు ఆరోపిస్తున్నారు. భీమిలి తహసీల్దార్ పి.రామారావుని వివరణ అడగగా ప్రభుత్వ భూమిలో కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించము. తక్షణమే ఫెన్సింగ్ పోల్స్ తొలగించి చర్యలు చేపడతామన్నారు.