PLD: అమరావతి రాజధానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బుద్ధ విగ్రహానికి సరికొత్త మెరుగులు దిద్దుతున్నారు. విగ్రహంపై పాత రంగులు వెలిసిపోవడంతో, పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రభుత్వం ప్రత్యేక సుందరీకరణ పనులు చేపట్టింది. ఈ నూతన మెరుగులు విగ్రహానికి కొత్త శోభను చేకూర్చడమే కాకుండా, పర్యాటక ప్రాంతంగా అమరావతి వైభవాన్ని మరింత పెంచనున్నాయి.