TPT: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన భక్తుడు కొవ్వూరి రామ్ దీప్ రెడ్డి టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు దాతను అభినందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు.