KDP: ప్రొద్దుటూరులో 1946లో నామ ఎరుకలయ్య ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ గీతాశ్రమం ఆదాయ వివరాలను ఈవో శ్రీధర్ శుక్రవారం వెల్లడించారు. ఆశ్రమానికి 5 కాలేజీల నుంచి రూ.65.41 లక్షలు, షాపులు, ఇళ్ల బాడుగల ద్వారా రూ.29 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని తెలిపారు. 38.96 ఎకరాల భూముల కౌలుతో పాటు రూ.2.01కోట్ల ఎల్డీలపై వడ్డీ వస్తోందని పేర్కొన్నారు.