VSP: సింహాచలం చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సోమవారం ఉదయం 3 గంటలకు తొలిదర్శనం, 3.30 నుంచి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. భక్తుల కోసం నీరు, మజ్జిగ, వైద్య శిబిరాలు, ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. వాహనాలకు పాస్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు.