VZM: బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులకు బొబ్బిలి CI కె. నారాయణరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. శనివారం రాత్రి స్దానిక ఇందిరమ్మ కాలనీలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా CI వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసు నమోదు చేస్తమని హెచ్చరించారు.