VSP: సింహాచలం గోశాలలో సేవ్ సంస్థ ఆధ్వర్యంలో శబల భోజనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంతో గర్భవతులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ పండుగలో కులాకార్ బియ్యం పంపిణీ చేశారు. చేతివృత్తులు, వెదురు ఇల్లు ఆకట్టుకోగా, ప్లాస్టిక్ రహిత ఏర్పాట్లు ప్రత్యేకంగా నిలిచాయి. సహజ పదార్థాలతో తయారుచేసిన పానీయాలు, విత్తనాలు, ప్రకృతి ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు.