PPM: మార్చి 3న సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా మండలంలోని తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఆలయ తలుపు లు మూసి వేయనున్నట్లు ఈఓ డి.శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. గ్రహణం అనంతరం బుధవారం గ్రహణ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుంచి స్వామి వారి సర్వ దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు.