అన్నమయ్య: రాయచోటిలో శ్రీవీరభద్ర స్వామివారి పార్వేట ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. గతేడాది నిర్వహించిన ఉత్సవ సందర్భంలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల అశ్వవాహనంపై వేటకు వెళ్లే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముస్లిం, మైనారిటీలు స్వామివారి ఊరేగింపునకు ఆహ్వానం పలికి తాగునీరు అందజేశారు.