అన్నమయ్య: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారురాలు రాజుల లక్ష్మీదేవికి రూ.2,14,698 విలువైన చెక్కును ముక్కా వరలక్ష్మి మంగళవారం అందజేశారు. ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటుందని ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సహాయం అందేలా కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.