CTR: సదుం మండలంలోని సజ్జలవారిపల్లెలో మంగళవారం పోషణ్ పక్వాడాపై ఐసీడీఎస్ సూపర్వైజరు మళ్లీశ్వరి అవగాహన కల్పించారు. యోగా ఉపయోగాలను వివరించారు. ప్రతి ఒక్కరూ దైనందిక జీవితంలో యోగాకు సమయం కేటాయించాలని సూచించారు. మానసిక, శారీరక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. తప్పని సరిగా సమతుల పోషకాహారం తీసుకోవాలని సూచించారు.