అన్నమయ్య: జిల్లాలో అమలు చేసిన ‘జలధార’ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిన్నమండెంలో జరిగిన సూర్యఘర్ ఉచిత సౌర విద్యుత్ పథకం ప్రారంభోత్సవంలో మంత్రి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. జలధార ప్రాజెక్టు విజయానికి విశేష కృషి చేసిన కలెక్టర్ను మంత్రి ఘనంగా సన్మానించారు.