మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో రోడ్డు ప్రమాదంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనం కావడం తీవ్ర ఆవేదన గురి చేసిందని, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులకు ఆయన ఆదేశించారు.