కృష్ణా: దేశ పురోగతిలో జగ్జీవన్ రామ్ పాత్ర మరువలేనిదని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ నేరెళ్లపాలెం బస్టాప్ వద్ధ భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు వెంకట్రామ్ నివాళులర్పించారు.