ATP: గవర్నర్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో రేపు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రోటోకాల్, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఎవరూ కలెక్టరేట్కు రాకూడదని, ఈ మార్పును ప్రజలు గమనించాలని కోరారు.