AP: కడప జిల్లా వేంపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. వీరన్నగట్టుపల్లె వద్ద విద్యుత్ తీగలు తగలడంతో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులోని 21 మంది ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై క్షేమంగా కిందికి దిగారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్రోచ్ రోడ్డుకు మట్టి ఎత్తుగా వేయడంతో బస్సుకు విద్యుత్ లైన్ తాకినట్లుగా స్థానికులు తెలిపారు.