ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు 30 శాతం ఇంటిరిమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కనిగిరిలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే 30% ఐఆర్ ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్కు నేతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.