కోనసీమ: భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ కోనేరు (పుష్కరిణి) ప్రస్తుతం దుస్థితికి చేరుకుంది. గత రెండేళ్లుగా నీటిని మార్చకపోవడంతో కోనేరు పాచిపట్టి, మురికి కూపంగా దర్శనమిస్తోంది. మరో నెల రోజుల్లో స్వామి వారి కళ్యాణోత్సవం రానుంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు