KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామంలోని రాయల చెరువు సమస్యలను పరిష్కరించాలని నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత అవగాహన కార్యక్రమంలో జేఈ సంజీవ్ కుమార్ను టీడీపీ సీనియర్ నేత వీరేష్ గౌడ్, సాగునీటి సంఘం అధ్యక్షులు నారాయణ శనివారం డిమాండ్ చేశారు. చెరువు గట్టుపై ముళ్ల కంపలు పెరిగి పోయాయని, దీంతో గట్టు బలహీనపడే ప్రమాదం ఉందని జేఈ దృష్టికి తీసుకెళ్లారు.