AKP: అచ్యుతాపురం కేజీబీవీ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశించారు. విద్యార్థిని నవ్య మృతి చెందిన నేపథ్యంలో ఇవాళ ఆకస్మికంగా ఎమ్మెల్యే కేజీబీవీని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.