అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని బండ్లపెంట దర్గా సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.మృతుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.