NLR: కావలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మరమ్మతులకు గురైన చేతిపంపు బోర్లుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. శనివారం కాలనీలో ఉన్న మూడు బోర్లను అధికారులు గుర్తించి రిపేరు చేశారు. వేసవికాలం తాగునీటి ఎద్దడి తలెత్తుకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ బోర్లు రిపేరు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.