TPT: సత్యవేడు పట్టణంలోని శ్రీమాతంగిశ్వరస్వామి ఆలయాన్ని టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం దాత కృష్ణయ్య యాదవ్ రూ.50 వేల చెక్కును శంకర్ రెడ్డి చేతుల మీదుగా అర్చకులకు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.