శ్రీకాకుళం నగరంలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి మేళా నిర్వహిస్తారు. 15 ప్రైవేటు సంస్థలు పాల్గొని 500 పైగా నియా మకాలు చేపట్టనున్నారు. వివరాలకు 9550967353, 8985675886 నంబర్లను సంప్రదించాలన్నారు.