కోనసీమ: గ్రామీణ ప్రాంతాలలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అన్నారు. సఖినేటిపల్లిలో రూ. కోటి 20 లక్షలతో నూతనంగా చేపట్టిన ఆర్ అండ్ బి రహదారి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీర మల్లిబాబు, జెడ్పీటీసీ దొండపాటి అన్నపూర్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.