CTR: బెంగళూరు-నాయుడుపేట జాతీయ రహదారిలో పి.కొత్తకోట గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీపురం వద్ద సర్వీస్ రోడ్డు గుంతలతో దెబ్బతింది. మూడు నెలలుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి రావడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు.