CTR: చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కాలేజీ సమీపంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో దుప్పి మృతి చెందింది. అటుగా వెళ్తున్న స్థానికులు దుప్పి మృత దేహాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుక్కల దాడిలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.