KDP: బైక్ దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి 16 బైక్లను స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్టేషన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోవెలకుంట రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్న వ్యక్తులను పట్టుకుని విచారించామన్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 16 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.