ప్రకాశం: సీ.ఎస్.పురం మండలం అంబవరం పంచాయతీ పరిధిలోని అంబవరం కొత్తపల్లి స్వర్ణ గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు ఈ సచివాలయం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలు సచివాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.