E.G: ఈ నెల 27న నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ బుధవారం తెలిపారు. ఈ సమావేశం ఆరోజు ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. పట్టణాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను ఎజెండా రూపంలో సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సభ్యులు వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.