ప్రకాశం: పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ బుధవారం యర్రగొండపాలెంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయసునీత, నియోజకవర్గ ఇంఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.