కోనసీమ: అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో వికాస ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ జాబ్ మేళాలకు 15 కంపెనీలు హాజరవ్వగా.. మొత్తం 1300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల మేరకు 18-30 ఏళ్లు ఉండి, టెన్త్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.