BPT: అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర నూర్ భాషా సంఘం ప్రధాన కార్యదర్శి, అద్దంకి పట్టణ 17వ వార్డు వైసీపీ యువ నేత కొటికలపూడి శ్రీను అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.